మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి వైదొలిగిన రాధాకృష్ణన్
- ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో రాజీనామా
- రేపు ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్న రాధాకృష్ణన్
- గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు మహారాష్ట్ర అదనపు బాధ్యతలు
రాధాకృష్ణన్ రాజీనామాతో ఖాళీ అయిన మహారాష్ట్ర గవర్నర్ పదవికి తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు మహారాష్ట్ర బాధ్యతలను అదనంగా అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 752 ఓట్లకు గాను ఆయనకు 452 ఓట్లు లభించాయి.
మహారాష్ట్ర రాజ్ భవన్లో రాధాకృష్ణన్కు నిన్న సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజీపడని జాతీయవాదినని స్పష్టం చేశారు. గవర్నర్గా కొనసాగిన 13 నెలల కాలాన్ని ప్రజాజీవితంలో సంతోషకరమైన సమయంగా అభివర్ణించారు. పరిపాలనాపరంగా, రాజకీయంగా మహారాష్ట్ర తనకు ఎంతో నేర్పిందని ఆయన అన్నారు.