తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

రేపు వినాయక చవితి (ఆగస్టు 27) పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ శుభ సందర్భంగా చంద్రబాబు తన సందేశాన్ని వెలువరిస్తూ, ప్రజలు నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ఆ గణనాథుడు అందరినీ అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా మండపాలను ఏర్పాటు చేసి, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య గణేశుడిని పూజిస్తున్న భక్తులకు సకల శుభాలు కలగాలని ఆ వినాయకుడిని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. ఈ పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలను నింపాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Chandrababu Naidu
VInayaka Chavithi
Ganesh Chaturthi
Andhra Pradesh
Telugu festival
Hindu festival
festival greetings
AP CM
Ganesh puja
Indian festivals

More Telugu News