'గుంటూరు కారం'పై ట్రోలింగ్... ఆశ్చర్యం వ్యక్తం చేసిన నిర్మాత నాగవంశీ

  • 2024 జనవరిలో వచ్చిన గుంటూరు కారం
  • మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మాస్ ఎంటర్టయినర్ చిత్రం
  • తొలి రెండ్రోజులు విపరీతంగా ట్రోల్ చేశారన్న నాగవంశీ
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గుంటూరు కారం’ చిత్రం 2024 జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదలై మిశ్రమ స్పందనలను అందుకుంది. ఈ సినిమా గురించి టాలీవుడ్ యువ నిర్మాత నాగవంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఈ సినిమాపై వచ్చిన నెగెటివ్ ట్రోల్స్ ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా  తొలి రెండ్రోజులు ఈ సినిమా విపరీతంగా ట్రోలింగ్ కు గురైందని, అలా ఎందుకు జరిగిందన్నది తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. అందులో ట్రోల్ చేయాల్సినంత విషయం ఏముంది... ఆ సినిమా ఓటీటీలో రిలీజై కూడా ఆడియన్స్ ను అలరించిందని వివరించారు.

‘గుంటూరు కారం’లో మహేశ్‌బాబుతో పాటు శ్రీలీల, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. ఈ చిత్రం తమిళ్, హిందీ, మలయాళ భాషల్లోనూ డబ్బింగ్‌ అయి విడుదలైంది.


More Telugu News