Vijayawada: విజ‌య‌వాడ‌లో జంట హ‌త్య‌ల క‌ల‌క‌లం

Double Murder in Vijayawada Two Young Men Killed
షార్ట్స్‌లో చూడండి
విజ‌య‌వాడ‌లో జంట‌హ‌త్య‌లు క‌ల‌క‌లం రేపాయి. నగర నడిబొడ్డున ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. మ‌ద్యం మ‌త్తులో ఉన్న ఇద్ద‌రు యువ‌కుల‌ను ఓ వ్య‌క్తి పొడిచి ప‌రారైన‌ట్లు స‌మాచారం. రక్తపు మడుగులో పడి ఉన్న రెండు మృతదేహాలు చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

ఈ ఘ‌ట‌న గ‌వ‌ర్న‌ర్‌పేట‌లోని అన్న‌పూర్ణ థియేట‌ర్ స‌మీపంలో చోటుచేసుకుంది. మృతులు ఇద్ద‌రూ విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది. వారు క్యాట‌రింగ్ ప‌నుల కోసం వ‌చ్చి, అన్న‌పూర్ణ థియేట‌ర్ స‌మీపంలో అద్దె గ‌దుల్లో ఉంటున్న‌ట్లు స‌మాచారం. 

స్థానికుల ద్వారా ఈ జంట హ‌త్యల‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌టనాస్థ‌లికి చేరుకుని మృతదేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఓ రౌడీషీట‌ర్ ఆ ఇద్ద‌రు యువ‌కుల‌ను క‌త్తితో పొడిచి హ‌త‌మార్చిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.  


Go Back to Shorts
Vijayawada
Vijayawada Double Murder
Double Murder
Annapurna Theater
Catering Workers
Andhra Pradesh Crime
Govenorpet
Vizianagaram District
Crime News
Murder Investigation

More Telugu News