పవన్ ను కలిసిన ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు
- జనసేన కార్యాలయంలో పవన్ ను కలిసిన మాధవ్
- మాధవ్ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్
- కూటమి కార్యాచరణ, సమన్వయంపై కీలక చర్చలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి మాధవ్ వెళ్లారు. ఈ సందర్భంగా మాధవ్ను పవన్ శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీగానే కాకుండా, రెండు పార్టీల మధ్య రాజకీయ సమన్వయంపై చర్చించేందుకు వేదికగా నిలిచింది. ఈ సమావేశంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వ కార్యాచరణ, ప్రభుత్వంలో భాగస్వామ్యం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై ఇరువురు నేతలు చర్చించారు. ముఖ్యంగా, మిత్రపక్షాలైన జనసేన, టీడీపీ, బీజేపీల మధ్య మరింత సమన్వయం పెంచుకోవడమే లక్ష్యంగా వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
కాగా, అంతకుముందు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాధవ్ పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. గతంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా పనిచేసిన మాధవ్కు ఆర్ఎస్ఎస్, బీజేవైఎంలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది.
కాగా, అంతకుముందు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాధవ్ పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. గతంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా పనిచేసిన మాధవ్కు ఆర్ఎస్ఎస్, బీజేవైఎంలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది.