Mahadevaswamy: ప్రియుడితో వెళ్లిపోయిన యువతి... మొత్తం కుటుంబం ఆత్మహత్య

Daughter elopement leads to family suicide in Karnataka
  • కర్ణాటకలోని మైసూరులో విషాదకర ఘటన
  • కన్నవారి ఆశలు అడియాశలు చేసిన ప్రేమ
  • తల్లిదండ్రులు, చెల్లెలు ఆత్మహత్య
కన్నకూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేని ఓ కుటుంబం తీవ్ర నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులతో పాటు మరో కుమార్తె కూడా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. మైసూరుకు చెందిన మహాదేవస్వామి, మంజుల దంపతులకు అర్పిత, హర్షిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తమ పిల్లలను బాగా చదివించి, ఉన్నత స్థాయిలో చూడాలని ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. అయితే, వారి పెద్ద కుమార్తె అర్పిత ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. పెద్దల మాటలను లెక్కచేయని అర్పిత, తాను ప్రేమించిన యువకుడితో ఇంటి నుంచి వెళ్లిపోయింది.

ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు, చెప్పాపెట్టకుండా ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడాన్ని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన మహాదేవస్వామి, మంజుల దంపతులు తమ చిన్న కుమార్తె హర్షితతో కలిసి సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కన్నవారి ఆశలను కాదని కూతురు తీసుకున్న నిర్ణయం, చివరకు ఆ కుటుంబంలోనే తీవ్ర విషాదాన్ని నింపింది.

Mahadevaswamy
Karnataka suicide
Mysore suicide
Family suicide
Love affair
Elopement
Suicide pond
Sister elopement
Family tragedy

More Telugu News