ఢిల్లీలో అమిత్ షా అత్యవసర సమీక్ష... రేపు అఖిలపక్ష సమావేశం
- పహల్గామ్ ఉగ్రదాడికి బదులుతీర్చుకున్న భారత్
- పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు
- ఆపరేషన్ సిందూర్ విజయవంతం
- పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాలతో సీఎంలతో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్
రేపు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష భేటీ
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో మే 8వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఆపరేషన్ సిందూర్ వివరాలను కేంద్రం ఈ అఖిలపక్ష సమావేశంలో పంచుకోనుంది.