ఆద్యంతం ఊగిసలాట... స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం
- 46 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 5.45 శాతం పతనమైన బజాజ్ ఫిన్ సర్వ్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ... భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ఆద్యంతం సూచీలు ఊగిసలాటకు గురయ్యాయి.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 46 పాయింట్లు నష్టపోయి 79,879కి పడిపోయింది. నిఫ్టీ 1 పాయింట్ నష్టంతో 24,334 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి మారకం విలువ 47 పైసలు పెరిగి రూ. 84.49గా కొనసాగుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (3.04%), భారతి ఎయిర్ టెల్ (2.18%), సన్ ఫార్మా (1.41%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.12%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.81%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-5.45%), బజాజ్ ఫైనాన్స్ (-4.99%), టాటా మోటార్స్ (-3.22%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.91%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.87%).
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 46 పాయింట్లు నష్టపోయి 79,879కి పడిపోయింది. నిఫ్టీ 1 పాయింట్ నష్టంతో 24,334 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి మారకం విలువ 47 పైసలు పెరిగి రూ. 84.49గా కొనసాగుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (3.04%), భారతి ఎయిర్ టెల్ (2.18%), సన్ ఫార్మా (1.41%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.12%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.81%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-5.45%), బజాజ్ ఫైనాన్స్ (-4.99%), టాటా మోటార్స్ (-3.22%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.91%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.87%).