ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి

  • రాష్ట్రంలో పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ 
  • 10 జిల్లాలకు డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల నియామకం
  • ఖరారు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 10 జిల్లాలకు సంబంధించి జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్‌) చైర్మన్ల నియామకాలను ఖరారు చేశారు. 

వివిధ జిల్లాల డీసీసీబీ చైర్మన్లుగా నియమితులైన వారు:
  • శ్రీకాకుళం: శివల సూర్యనారాయణ
  • విజయనగరం: కిమిడి నాగార్జున
  • విశాఖపట్నం: కోన తాతారావు
  • గుంటూరు: మాకినేని మల్లికార్జునరావు
  • కృష్ణా: నెట్టెం రఘురాం
  • నెల్లూరు: ధనుంజయ రెడ్డి
  • చిత్తూరు: అమ్మస రాజశేఖర్ రెడ్డి
  • అనంతపురం: కేశవ రెడ్డి
  • కర్నూలు: డి. విష్ణువర్ధన్ రెడ్డి
  • కడప: సూర్యనారాయణ రెడ్డి

వివిధ జిల్లాల డీసీఎంఎస్‌ చైర్మన్లుగా నియమితులైన వారు:
  • శ్రీకాకుళం: చౌదరి అవినాష్
  • విశాఖపట్నం: కోట్ని బాలాజీ
  • విజయనగరం: గొంప కృష్ణ
  • గుంటూరు: వర్తనం హరిబాబు
  • కృష్ణా: బండి రామకృష్ణ
  • నెల్లూరు: జి. నాగేశ్వరరావు
  • చిత్తూరు: సుబ్రహ్మణ్యం నాయుడు
  • అనంతపురం: నెట్టం వెంకటేశ్వరులు
  • కర్నూలు: నాగేశ్వర యాదవ్
  • కడప: ఎర్రగొండ్ల జయప్రకాశ్

ఈ నియామకాలతో కీలకమైన సహకార రంగ సంస్థలకు కొత్త అధిపతులు వచ్చినట్లయింది. ప్రభుత్వం త్వరలోనే మరిన్ని నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


More Telugu News