యూపీలో ముస్లింలు భద్రమేనా అంటే సీఎం యోగి ఏమన్నారంటే..?
- దేశంలో ముస్లింలకు అత్యంత సురక్షిత ప్రదేశం ఉత్తరప్రదేశ్ అని వెల్లడి
- ఇక్కడ హిందువులు సేఫ్ గా ఉన్నంతకాలం ముస్లింలు కూడా క్షేమమేనని వివరణ
- వంద హిందూ కుటుంబాల మధ్య ఓ ముస్లిం కుటుంబం నిర్భయంగా జీవిస్తుందన్న యోగి
ఇందుకు ఉదాహరణ బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ లలోని హిందువుల పరిస్థితేనని యోగి చెప్పారు. యూపీలో 2017కు ముందు హిందువుల ఇళ్లు, షాపులు తగలబడిన సందర్భాలు చూశామని, అదే సమయంలో ముస్లింల షాపులు కూడా కాలిబూడిదయ్యాయని గుర్తుచేశారు. కానీ 2017 తర్వాత ఈ గొడవలు సమసిపోయాయని, తమ ప్రభుత్వం ఇలాంటి వాటిపట్ల కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు ‘సబ్ కా సాథ్, సబ్ కా సమ్మాన్’ నినాదంతో ముందుకు వెళుతున్నాయని, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్ఫూర్తిగా ఐకమత్యంతో అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని యోగి తెలిపారు.