ఉక్రెయిన్కు ట్రంప్ షాక్.. మిలటరీ సాయం నిలిపివేత
- ఇటీవల శ్వేతసౌధంలో జరిగిన సమావేశంలో ట్రంప్, జెలెన్కీ మధ్య మాటల యుద్ధం
- ఇప్పుడు ఆ దేశానికి అందిస్తున్న మిలటరీ సాయం నిలిపివేస్తూ ట్రంప్ ఆదేశాలు
- శాంతి విషయంలో ట్రంప్ చాలా స్పష్టంగా ఉన్నారన్న వైట్హౌస్
- ఇప్పటికే ఆయుధాలతో బయలుదేరిన నౌకలు, విమానాల నిలిపివేత
అధ్యక్షుడు (ట్రంప్) శాంతి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారని, తమ భాగస్వాములందరూ ఆ లక్ష్యానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని వైట్హౌస్ అధికారి ఒకరు తెలిపారు. తాము అందిస్తున్న సాయం సమస్య పరిష్కారానికి పనికొస్తుందా? లేదా? అన్నదానిపై సమీక్షిస్తామని, అందుకే సాయాన్ని నిలిపివేసినట్టు పేర్కొన్నారు.
శుక్రవారం వైట్హౌస్లో రష్యా-ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశం వాడీవేడిగా సాగింది. రష్యాతో యుద్ధంలో సాయం చేస్తున్నా ఉక్రెయిన్ తమకు కృతజ్ఞతగా ఉండటం లేదని ట్రంప్ నిందించారు. ఉక్రెయిన్కు ఆయుధాలు తీసుకెళుతూ పోలండ్లోని ట్రాన్సిట్ ఏరియాలో ఉన్న నౌకలు, విమానాలను అక్కడే నిలిపివేయనున్నట్టు వైట్హౌస్ అధికారి తెలిపారు. కాగా, జెలెన్స్కీపై ట్రంప్ నిన్న కూడా విరుచుకుపడ్డారు. మరోవైపు, రష్యాతో యుద్ధం ముగింపు అంశం చాలా దూరంలో ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం.