హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్
- సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్
- వైద్య పరీక్షల అనంతరం ఇంటికి వెళ్లనున్న బీఆర్ఎస్ అధినేత
- నిన్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేసీఆర్
మరోవైపు కేసీఆర్ చాలా రోజుల తర్వాత నిన్న బహిరంగంగా కనిపించారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ... తెలంగాణకు ఎప్పటికీ రక్షణ కవచం బీఆర్ఎస్సేనని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బంపర్ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు రాబోతోందని... ఆ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని... అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.