శబరిమలలో మకరజ్యోతి దర్శనం... పులకించిన భక్తులు
- నేడు సంక్రాంతి
- ఈ సాయంత్రం పొన్నాంబలమేడు కొండల్లో దివ్య జ్యోతి దర్శనం
- అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన శబరి గిరులు
ఇవాళ సంక్రాంతి పండుగ నేపథ్యంలో, నేటి సాయంత్రం పొన్నాంబలమేడు కొండల్లో మకర జ్యోతి దర్శనమిచ్చింది. ఈ జ్యోతిని స్వామివారి అంశగా భావించే అయ్యప్ప భక్తులు ఈ దృశ్యాన్ని చూసి పరవశించిపోయారు. మకర జ్యోతి కనిపించడంతో శబరిమల గిరులు అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయాయి.
మకర జ్యోతిని ప్రత్యక్షంగా 1.5 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా. కాగా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా శబరిమల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.