బంపర్ ఆఫర్... కోడిపందెం విజేతలకు మహీంద్రా థార్!
- సంక్రాంతి సందర్భంగా కోడిపందాల జోరు
- కాకినాడ జిల్లాలోనూ కోడిపందాల సందడి
- కోడిపందాల బరి వద్ద థార్ వాహనాన్ని ప్రదర్శిస్తున్న నిర్వాహకులు
ఇక అసలు విషయానికొస్తే... కాకినాడ జిల్లా కరప మండలంలోనూ భారీ ఎత్తున కోడిపందాల బరులు ఏర్పాటు చేశారు. ఓ కోడిపందెం బరిలో నిర్వాహకులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. విజేతలకు మహీంద్రా థార్ వాహనం బహుమతిగా ఇస్తామని తెలిపారు. అంతేకాదు, కోడిపందెం బరి వద్దే మహీంద్రా థార్ వాహనాన్ని ప్రదర్శిస్తూ, కోడిపందెం రాయుళ్లను ఊరిస్తున్నారు. ఈ వాహనం ఖరీదు రూ.25 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.