ఆశారాం బాపుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
- జీవితఖైదు అనుభవిస్తున్న ఆశారాం బాపు
- మార్చి 31 వరకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
- తన అనుచరులను కలవకూడదని సుప్రీంకోర్టు షరతు
గుజరాత్ లోని మోతేరాలో ఆశారాం బాపూ ఆశ్రమంలో తాను పనిచేస్తున్న సమయంలో తనపై ఆయన పలుమార్లు అత్యాచారం చేశారంటూ సూరత్ కు చెందిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2001 నుంచి 2006 మధ్య తనపై ఎన్నోసార్లు అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాం బాపుతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.
గాంధీనగర్ సెషన్స్ కోర్టు ఆశారాంను దోషిగా తేల్చింది. మిగిలిన వారికి సంబంధించి సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఆ తర్వాత ఆశారాంకు జీవితఖైదు విధించింది. 16 ఏళ్ల బాలికపై జోధ్ పూర్ ఆశ్రమంలో అత్యాచారం కేసులో కూడా ఆశారాం దోషిగా తేలారు. ఈ కేసులో కూడా ఆశారాంకు జీవితఖైదు పడింది.