గజ్వేల్ లో ఘోర ప్రమాదం.. ఇద్దరు కానిస్టేబుళ్లు దుర్మరణం
- ఈసీఐఎల్ లో జరుగుతున్న మారథాన్ కోసం వెళుతుండగా ప్రమాదం
- జాలిగామ బైపాస్ రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో స్పాట్ లోనే మృతి
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు
ఆదివారం ఈసీఐఎల్ లో జరుగుతున్న మారథాన్ లో పాల్గొనేందుకు వారిద్దరూ బైక్ పై బయలుదేరగా జాలిగామ బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగిందని వివరించారు. కాగా.. ఈ ప్రమాదంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హరీశ్ రావు హామీ ఇచ్చారు.