ముంబయి రెస్టారెంట్లో ప్రత్యక్షమైన కోహ్లీ-అనుష్క.. నెట్టింట ఫొటోలు వైరల్!
- తన విరామ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతున్న కోహ్లీ
- ప్రస్తుతం ముంబయిలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న వైనం
- ఈ క్రమంలో బెన్నె బాంబే రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేసిన కోహ్లీ దంపతులు
- ఆ సమయంలో దిగిన ఫొటోలను పంచుకున్న రెస్టారెంట్
ఈనెల 5న తన పుట్టినరోజును కూడా ఇక్కడే జరుపుకున్నాడు. తన విరామ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతున్నాడు. ప్రస్తుతం ముంబయిలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య అనుష్క శర్మ కుమారుడు అకాయ్, కుమార్తె వామికతో కలిసి సరదాగా గడుపుతున్నాడు.
తాజాగా ఈ దంపతులు ముంబయిలోని ఫేమస్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ బెన్నె బాంబేలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ సిబ్బందితో ఇద్దరూ సరదాగా ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను సదరు రెస్టారెంట్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది. దాంతో ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.