Chandrababu: సతీసమేతంగా రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం చంద్రబాబు

CM Chandrababu met Governor at Raj Bhavan
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం చంద్రబాబు, తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ కు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పిన చంద్రబాబు... ఆయనకు జ్ఞాపికను కూడా బహూకరించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు గవర్నర్ తో కాసేపు సమావేశమయ్యారు. ప్రభుత్వ పాలనా విధానాలను వివరించారు. దీపావళి కానుకగా ఈ నెల 31 నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చంద్రబాబు గవర్నర్ కు తెలియజేశారు. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ విధివిధానాలను ఆయనకు వివరించారు.
Go Back to Shorts
Chandrababu
Governor
Raj Bhavan
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News