టీడీపీ ఆఫీసుపై దాడి కేసు నిందితుడు చైతన్యకు వైద్య పరీక్షలు

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఇటీవల కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చైతన్య ఏ1 నిందితుడిగా ఉన్నాడు. 

చైతన్యను కస్టడీకి అప్పగించాలని ఇటీవల సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన మంగళగిరి కోర్టు చైతన్యను మూడ్రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో, చైతన్యను ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. 

ఈ క్రమంలో, నేడు చైతన్యకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల నివేదిక వచ్చిన అనంతరం అతడిని సీఐడీ కార్యాలయానికి తరలించనున్నారు.

TDP Office Attack Case
Panuganti Chaitanya
CID Custody
YSRCP

More Telugu News