ఏచూరి మరణం కలచివేసింది: చిరంజీవి
- ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రయాణంలో ఉన్నారన్న చిరంజీవి
- సామాన్య, అణగారిన ప్రజల గొంతుకగా ఉన్నారని కితాబు
- దేశం పట్ల ఏచూరి నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని వ్యాఖ్య
సీతారాం ఏచూరి కుటుంబానికి, ఆయన అభిమానులకు, సీపీఎం వర్గానికి సానుభూతిని తెలియజేస్తున్నానని చిరంజీవి చెప్పారు. ప్రజాసేవ, దేశం పట్ల ఏచూరికి ఉన్న నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. మనం గొప్ప నాయకుడిని కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.