Chiranjeevi: ఏచూరి మరణం కలచివేసింది: చిరంజీవి

Deeply distressed by the news of the passing of Sitaram Yechury says Chiranjeevi
షార్ట్స్‌లో చూడండి
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం తనను కలచివేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రయాణంలో ఉన్నారని చెప్పారు. స్టూడెంట్ యాక్టివిస్ట్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పటి నుంచి సామాన్య, అణగారిన వర్గాల ప్రజల గొంతుకగా ఉన్నారని కితాబునిచ్చారు. 

సీతారాం ఏచూరి కుటుంబానికి, ఆయన అభిమానులకు, సీపీఎం వర్గానికి సానుభూతిని తెలియజేస్తున్నానని చిరంజీవి చెప్పారు. ప్రజాసేవ, దేశం పట్ల ఏచూరికి ఉన్న నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. మనం గొప్ప నాయకుడిని కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Chiranjeevi
Tollywood
Sitaram Yechury
CPM

More Telugu News