Balakrishna: రెండు తెలుగు రాష్ట్రాలకు బాలకృష్ణ భారీ విరాళం

భారీ వరదల కారణంగా ఇరు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ ముందుకు వస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు విరాళాలను ప్రకటించారు. 

తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా తన వంతుగా భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ సీఎం సహాయనిధికి రూ. 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు అందిస్తున్నానని తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో బాధాతప్త హృదయంతో ఈ సాయాన్ని అందిస్తున్నానని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. 

మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలకు జూనియర్ ఎన్టీఆర్ రూ. 50 లక్షల చొప్పున... సిద్ధు జొన్నలగడ్డ రూ. 15 లక్షల చొప్పున... మరో హీరో విష్వక్సేన్ రూ. 5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.
Balakrishna
Tollywood
Telugudesam
Donation
Floods

More Telugu News