టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం... వెల్లువెత్తిన విజ్ఞప్తులు
క్రీడాకారులు, డీఎస్సీ అభ్యర్థులు, హోంగార్డులు, సామాన్య ప్రజలు... ఇలా విజ్ఞప్తులతో భారీగా తరలివచ్చారు. వారి నుంచి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, తదితరులు ఓపికగా అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి, ఇతర టీడీపీ నేతలు గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి... పరిష్కారానికి అక్కడిక్కడే అధికారులకు ఫోన్లు చేశారు. వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.