Chiranjeevi: కేరళ సీఎం విజయన్ ను కలిసి రూ.1 కోటి చెక్ అందించిన చిరంజీవి... ఫొటోలు ఇవిగో!

కేరళలోని వాయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపం కారణంగా 400 మందికి పైగా మృత్యువాతపడడం తెలిసిందే. వాయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాది మంది గల్లంతు కావడం అందరినీ కదలించింది. 

ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ విపత్తులో జరిగిన ప్రాణనష్టం పట్ల చలించిపోయారు. ఇరువురు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.1 కోటి విరాళం ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో చిరంజీవి నేడు ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిసిన చిరంజీవి రూ.1 కోటి చెక్ ను ఆయనకు అందించారు. ఈ సందర్భంగా చిరంజీవికి సీఎం విజయన్ ధన్యవాదాలు తెలిపారు.
Chiranjeevi
CM Vijayan
Kerala
Wayanad
Ramcharan
Landslides
Disastor

More Telugu News