పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ టీమ్ సెమీఫైనల్ ప్రత్యర్థి ఖరారు
మరో సెమీఫైనల్లో స్పెయిన్-నెదర్లాండ్స్ తలపడనున్నాయి. టోక్యో ఒలింపిక్స్లో రజత పతక విజేత అయిన ఆస్ట్రేలియాపై 2-0 తేడాతో విజయం సాధించి నెదర్లాండ్స్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక స్పెయిన్ జట్టు 3-2తో బెల్జియంను మట్టికరిపించింది.
వరుసగా రెండో పతకం గెలిచే ఛాన్స్
2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పోరులో భారత్ 5-4తో జర్మనీపై చారిత్రాత్మకమైన విజయం సాధించింది. 1980 మాస్కో ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన తర్వాత తిరిగి పతకం గెలవడం అదే తొలిసారి. ఇక ఈసారి హర్మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని జట్టు సెమీస్లో జర్మనీని ఓడిస్తే ఫైనల్కు చేరే అవకాశం లభిస్తుంది. ఫైనల్లో స్వర్ణం గెలిస్తే సరికొత్త చరిత్ర లిఖించడం ఖాయమవుతుంది.
కాగా ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బ్రిటన్పై భారత్ సంచలన విజయం సాధించింది. ఆట పూర్తయ్యే సమయానికి ఇరు జట్లు 1-1 గోల్స్ సాధించడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్కు దారితీసింది. షూటౌట్లో భారత్ 4-2తో చారిత్రాత్మక విజయం సాధించింది.