కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల 300 మంది చిరుద్యోగులు, పేదలు రోడ్డున పడ్డారు: ఈటల
- చిరుద్యోగులు, పేదలు భూమి కొని... ఇళ్లు కట్టుకుంటే కూల్చేశారని ఈటల మండిపాటు
- అక్రమ భూములైతే ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఎలా వచ్చిందని ప్రశ్న
- పేదల ఇళ్ల జోలికి వెళ్లవద్దని ఎన్నోసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానని వెల్లడి
భూముల ధరలు పెరిగాయని ఇప్పుడు కూల్చివేయడం దారుణమన్నారు. అవి అక్రమ భూములు అయితే నాడు ఇళ్ల నిర్మాణానికి, గృహ రుణాలకు ఎలా అనుమతి వచ్చిందని ప్రశ్నించారు. అన్ని అనుమతులతో నిర్మించిన ఇళ్లను ఎలా కూల్చివేస్తారని నిలదీశారు.
ఈ ప్రభుత్వ తీరు వల్ల వందలమంది ఇళ్లు లేని వారయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం కొన్న భూముల గురించి ఇప్పుడు కలగజేసుకోవడం ఏమిటన్నారు. పేదల ఇళ్ల జోలికి వెళ్లవద్దని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశానని తెలిపారు.