ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించిన కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ
- ప్రత్యేక హోదా తీర్మానాలు చేస్తే ఇచ్చేది కాదని వ్యాఖ్య
- హోదాపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధాని మోదీ అని వెల్లడి
- బీహార్ రాష్ట్రానికి ఇదే వర్తిస్తుందని స్పష్టీకరణ
హోదా ఎందుకు ఇవ్వలేదో గతంలోనే స్పష్టంగా చెప్పామన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు చెప్పారు. ఆ నిధుల ద్వారా ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఏపీ అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలో ఆలోచించి ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం కారణంగా పోలవరం సమస్యల్లో ఉందన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకారం ఉంటుందన్నారు.