అమరావతిలో సామగ్రి దొంగిలించిన వారిపై చర్యలు: మంత్రి నారాయణ
- కమిటీలు వేసి రాజధానిలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తామని వెల్లడి
- అభివృద్ధి పనులకు సంబంధించి కొత్తగా టెండర్లను పిలవాల్సి ఉందన్న మంత్రి
- కొత్త అంచనాలతో టెండర్లను పిలుస్తామన్న నారాయణ
ఈ టెండర్ల ప్రక్రియకు కనీసం మూడు నుంచి నాలుగు నెలలు పడుతుందని మంత్రి తెలిపారు. కేబినెట్లో చర్చించిన అనంతరం ఈ పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అమరావతిలో అభివృద్ధి పనులకు రెండున్నర సంవత్సరాల సమయం పట్టవచ్చునన్నారు. అమరావతిలో ఇళ్ల స్థలాల అంశంపై మాట్లాడుతూ, ఇది సుప్రీంకోర్టులో ఉందని తెలిపారు. ఇళ్ల స్థలాల విషయమై న్యాయ సలహాలు తీసుకుంటామన్నారు.