గ్రామంలోని తాగునీటి ట్యాంకులో పురుగుల మందు.. ఓటమి అక్కసుతోనేనా?
- అనంతపురం జిల్లా తుంబిగనూరు గ్రామంలో ఘటన
- శుక్రవారం అర్ధరాత్రి ట్యాంకు వద్ద అనుమానితులు
- గ్రామస్థుల అప్రమత్తతతో తప్పిన ముప్పు
శనివారం ఉదయం అధికారులు గ్రామానికి విడుదల చేసే తాగునీటి సరఫరాను ఆపేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గ్రామానికి చేరుకున్న పోలీసులు మంచినీటి ట్యాంకును పరిశీలించారు. శుక్రవారం అర్ధరాత్రి ట్యాంకు దగ్గర ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సంచరించడం గమనించామని, ఎవరు ఏమిటని ప్రశ్నించగా పారిపోయారని గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.