Arshdeep Singh: అశ్విన్ రికార్డును బ్రేక్ చేసిన అర్ష్‌దీప్‌ సింగ్‌!

టీ20 ప్రపంచకప్‌ లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా సూపర్‌-8లో అడుగు పెట్టింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ జట్టును భారత పేసర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ 4 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. 

ఇక నాలుగు వికెట్లతో రాణించిన అర్ష్‌దీప్‌ సింగ్‌ అరుదైన రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. అలాగే పదేళ్ల రవిచంద్రన్ అశ్విన్ రికార్డును బ్రేక్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తరపున ఉత్తమ గణాంకాలను (4/9) నమోదు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు (4/11) గణాంకాలతో అశ్విన్ పేరిట ఉంది. 2014 టీ20 ప్రపంచకప్‌ లో మీర్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఈ స్పిన్నర్ 11 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. 

అలాగే మూడో స్థానంలో హర్భజన్ సింగ్ (4/12) ఉన్నాడు. 2012లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తో మ్యాచ్ లో ఈ గణాంకాలను సాధించాడు. కాగా, నిన్నటి మ్యాచ్ లో బెస్ట్ బౌలింగ్ తో ఆకట్టుకున్న అర్ష్‌దీప్‌ సింగ్‌ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు.
Arshdeep Singh
Ravichandran Ashwin
ICC T20 World Cup 2024
Team India
Cricket
Sports News

More Telugu News