తెలంగాణ సహా ఆ రాష్ట్రాల్లో బీజేపీ ఉనికిలోనే లేదు... 400 సీట్లు ఎలా సాధిస్తుంది?: ఖర్గే ప్రశ్న
- కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉనికిలోనే లేదన్న మల్లికార్జున ఖర్గే
- గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ సీట్లను కోల్పోతుందని జోస్యం
- ఇండియా కూటమి పుంజుకుంటుందని ధీమా
- కర్ణాటక, మహారాష్ట్రలలో బీజేపీ బలంగా లేదని వ్యాఖ్య
గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఇప్పుడు చాలా సీట్లను కోల్పోనుందని జోస్యం చెప్పారు. ఇండియా కూటమి పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో బీజేపీ బలంగా లేదన్నారు. మహారాష్ట్రలోనూ బలహీనంగా ఉందని తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో మాత్రమే ఫైట్ ఇస్తోందన్నారు. ఇలాంటప్పుడు వారు చెప్పినన్ని సీట్లు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు.