హైదరాబాద్ మెట్రో అరుదైన ఘనత.. 50 కోట్ల రైడర్షిప్ దాటేసి సరికొత్త రికార్డు
- నిన్నటి వరకు మెట్రోలో ప్రయాణించిన 50 కోట్ల మంది
- నవంబర్ 2017లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో
- పండుగలు, క్రికెట్ మ్యాచ్లు, ప్రత్యేక సందర్భంగా సర్వీసుల పొడిగింపు
- రోజుకు 5 లక్షల మంది రాకపోకలు
గతరాత్రి ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా అర్ధరాత్రి దాటాక 12.15 గంటల వరకు మెట్రో తన సర్వీసులను పొడిగించింది. ఎన్జీఆర్ఐ, స్టేడియం, ఉప్పల్ స్టేషన్ల నుంచి ఈ రైళ్లు ప్రారంభమయ్యాయి. క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా రౌండ్ ట్రిప్ టికెట్లను కూడా మెట్రో అందుబాటులోకి తెచ్చింది.