రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు.. ఇద్దరు కీలక నిందితుల అరెస్ట్!
- జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ప్రధాన నిందితులు
- ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ తాహాను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
- కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లలో 18 చోట్ల తనిఖీల తర్వాత నిందితుల అరెస్ట్
అలాగే పేలుడుకు పాల్పడిన వ్యక్తికి స్థానికంగా సహకరించిన ముజమ్మిల్ షరీఫ్ను కూడా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. షరీఫ్, హుస్సేన్, తాహా ఈ ముగ్గురూ ఐఎస్ఐఎస్ మాడ్యూల్స్తో సంబంధం కలిగి ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. గతేడాది నవంబర్లో నమోదైన మంగుళూరు కుక్కర్ పేలుడు కేసుతో పాటు శివమొగ్గ గ్రాఫిటీ కేసులోనూ వీరి ప్రమేయం ఉన్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.