ఫోన్ ట్యాపింగ్తో సినీ పరిశ్రమ, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేశారు: రఘునందన్ రావు
- డీజీపీని కలిసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేత
- నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరినట్లు వెల్లడి
- ఈ కేసులో నిందితులను రిమాండ్కు పంపించాలని విజ్ఞప్తి
ఈ కేసులో అసలు ముద్దాయి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆరేనని ఆరోపించారు. ఏ1గా కేసీఆర్ను, ఏ2గా మాజీ మంత్రి హరీశ్ రావు, ఏ3గా సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాతే మిగిలిన ఆఫీసర్లను చేర్చాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి బాధితుడు రేవంత్ రెడ్డి అయితే రెండో బాధితుడిని తానే అన్నారు.