తెలంగాణకు ఏం చేశారు?: కాంగ్రెస్, బీజేపీలపై మల్లారెడ్డి ఆగ్రహం
- రెండు జాతీయ పార్టీలకూ తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు లేదన్న మల్లారెడ్డి
- బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఏ మొహం పెట్టుకొని ఓటు అడుగుతారు? అని మండిపాటు
- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామా? అని ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్య
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశ ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామా? అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. అసలు ఆ పార్టీలకు తెలంగాణలో ఓటు బ్యాంకే లేదన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఆయన సీఎం అయితేనే ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తాయన్నారు.