నారా లోకేశ్కు విజయరేఖ లేదు: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి
- ధనదాహంతో గెలిచేందుకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారన్న మంగళగిరి ఎమ్మెల్యే
- అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరికి పైసా పనిచేయలేదని ఆరోపణలు
- రాష్ట్రంలో టీడీపీని ఆశీర్వదించే పరిస్థితులు లేవన్న ఆళ్ల రామకృష్ణా రెడ్డి
తండ్రీ, కొడుకులు ఐదేళ్లు అధికారంలో ఉండి మంగళగిరికి పైసా పని చేయలేదని అన్నారు. మధ్యతరగతివారు, పేదలు, రైతులు అందరూ సంతోషంగా జీవించే మంగళగిరి కావాలని, వేల కోట్ల అధిపతులు మాత్రమే ఉండే గచ్చిబౌలిలు తమకు అవసరంలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆశీర్వదించే పరిస్థితులు రాష్ట్రంలో లేవని అన్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి మంగళగిరిలో జరిగిన వైసీపీ శ్రేణుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.