అస్సాంలో పట్టుబడ్డ ఐసిస్ ఇండియా చీఫ్ హరీస్ ఫారూఖీ
- ఫారుఖీతో పాటు అదుపులోకి మరో కీలక ఉగ్రవాది
- చిన్న క్లూ అందడంతో రంగంలోకి దిగి పట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్
- బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి ప్రవేశించిన వెంటనే పట్టుకున్న పోలీసులు
- ఎన్ఐఏకి అప్పగించనున్న అస్సాం పోలీసులు
ఇద్దరి గుర్తింపు వివరాలను పోలీసులు నిర్ధారించారు. హారిస్ ఫారూఖీ డెహ్రాడూన్లోని చక్రతాకు చెందినవాడని, ఐఎస్ఐఎస్ ఛీఫ్గా వ్యవహరిస్తున్నాడని గోస్వామి చెప్పారు. మరోవైపు ఫారూఖీతో పాటు పట్టుబడ్డ వ్యక్తి పేరు అనురాగ్ సింగ్ అని, పానిపట్కు చెందిన ఇతడు రెహాన్ అని పేరు మార్చుకొని ఇస్లాంలోకి మారాడని వెల్లడించారు. అయితే ఇతడు బంగ్లాదేశ్కు చెందిన ప్రముఖ మహిళను పెళ్లి చేసుకున్నాడని వివరించారు. వీరిద్దరూ భారత్లో ఐసిస్ ముఖ్యమైన నాయకులని, సంస్థ సభ్యులను ఉగ్రవాద దాడులకు ప్రేరేపిస్తుంటారని వెల్లడించారు. భారత్లోని అనేక ప్రదేశాలలో ఐఈడీలు ఉపయోగించి పేలుడు కుట్రలకు పాల్పడ్డారని ప్రణబ్ జ్యోతి గోస్వామి చెప్పారు. రిక్రూట్మెంట్, నిధులు సేకరణ చేస్తుంటారని వివరించారు.