ఐపీఎల్పై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఐపీఎల్పై ప్రామాణికంగా టీ20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక చేయబోమని స్పష్టత
- ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకోవడం లేదా దారుణమైన విఫలమైన సందర్భాలను మినహా పెద్దగా ప్రాధాన్యత ఉండదని వెల్లడి
- కోహ్లీకి టీ20 జట్టులో చోటు దక్కకపోవచ్చనే కథనాల నేపథ్యంలో అగార్కర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేయకపోవచ్చంటూ రిపోర్టులు వెలువడుతున్న నేపథ్యంలో అగార్కర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాగా విరాట్ మరికొన్ని రోజుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రీ-టోర్నమెంట్ క్యాంప్లో చేరబోతున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మార్చి 22న ఆరంభ మ్యాచ్ నాటికి అందుబాటులో ఉంటాడని వెల్లడించింది.