వైసీపీలో చేరిన సీఎం జగన్ మాజీ ప్రత్యర్థి
- సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సతీశ్ కుమార్ రెడ్డి
- 2014, 2019లో పులివెందులలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైనం
- రెండు సార్లూ జగన్ చేతిలో పరాజయం
- అంతకుముందు వైఎస్ చేతిలోనూ రెండు పర్యాయాలు ఓటమి
- 2020లో టీడీపీకి గుడ్ బై
2014, 2019 ఎన్నికల్లో సతీశ్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పులివెందులలో సీఎం జగన్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2004, 2009లో సతీశ్ కుమార్ రెడ్డి దివంగత వైఎస్సార్ చేతిలో ఓడిపోయారు.
2011లో టీడీపీ తరఫున కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శాసనమండలికి డిప్యూటీ చైర్మన్ గానూ వ్యవహరించారు. ఆయన 2020లో టీడీపీకి రాజీనామా చేశారు.