Manickam Tagore: మీడియాపై దాడులకు మద్దతు ఇచ్చేలా ఏపీ ప్రభుత్వ వైఖరి ఉంది: మాణికం ఠాగూర్

Manickam Tagore condemns attacks on media in AP

  • ఏపీలో మీడియాపై దాడులు
  • ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై, ఈనాడు కార్యాలయంపై దాడులు
  • తీవ్రంగా ఖండించిన ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జి మాణికం ఠాగూర్
  • జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శలు

ఏపీలో గత కొన్ని రోజుల వ్యవధిలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పైనా, ఈనాడు పత్రికా కార్యాలయంపైనా జరిగిన దాడులను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ ఖండించారు. దాడులకు మద్దతు ఇచ్చేలా ప్రభుత్వ వైఖరి ఉండడం సరికాదని స్పష్టం చేశారు. గత నాలుగున్నరేళ్లుగా జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే అసహనానికి గురై మీడియాపై దాడులు చేస్తున్నారని మాణికం ఠాగూర్ పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యపై రేపు సచివాలయ మార్చ్ చేపడతామని వెల్లడించారు. యువతకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వానికి వినతిపత్రం ఇస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News