సోనియాగాంధీ, చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు
- ఏపీకి సోనియా తీరని అన్యాయం చేశారన్న విజయసాయి
- దళితులను చంద్రబాబు ఓటు బ్యాంకుగా చూశారని విమర్శ
- ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే జగన్ మరోసారి సీఎం కావాలని వ్యాఖ్య
రానున్న ఎన్నికలు ధనికులకు, పేదవారికి మధ్య జరిగే రెఫరెండమని విజయసాయి చెప్పారు. ఎన్నికల యుద్ధంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ప్రతి పేదవాడు జగన్ పక్కన నిలబడి ఆయనను గెలిపిస్తారని విజయసాయి అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే జగన్ మరోసారి సీఎం కావాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి మల్లెల రాజేశ్ నాయుడు పోటీ చేస్తారని... ఆయనను గెలిపించాలని ప్రజలను కోరారు.