శాసన సభ ఆవరణలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్
- హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం
- పూలే విగ్రహం ఏర్పాటు కోసం బీసీలు ఏకం కావాలని పిలుపు
- ఏప్రిల్ 11 లోగా విగ్రహం ఏర్పాటుపై సానుకూల ప్రకటన రావాలన్న కవిత
అసెంబ్లీ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేయాలని స్పీకర్కు వినతి పత్రాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ఇందుకోసం తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మద్దతు కూడగట్టడానికి లేఖలు రాసినట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి పోరాటం చేస్తామని తెలిపారు. ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమించి సాధించామన్నారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళల కోటా కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతోమంది సంఘసంస్కర్తల జయంతులను అధికారికంగా నిర్వహించిందన్నారు.