ఫాంహౌస్ లో దోసెలు వేసిన రామ్ చరణ్

  • బెంగళూరులో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్న మెగా, అల్లు ఫ్యామిలీలు
  • నేడు ఉత్సాహంగా భోగి మంటలు కార్యక్రమం
  • చెఫ్ అవతారం ఎత్తిన రామ్ చరణ్
మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ సంక్రాంతి వేడుకలను బెంగళూరు ఫాంహౌస్ లో జరుపుకుంటున్నారు. నిన్ననే బెంగళూరు చేరుకున్న రామ్ చరణ్, ఉపాసన, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అల్లు అరవింద్ ఇతర కుటుంబ సభ్యులు ఫాంహౌస్ లో పండుగ క్షణాలను ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ చెఫ్ అవతారం ఎత్తారు. తన వాళ్ల కోసం దోసెలు వేస్తూ బిజీగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. 


More Telugu News

Ram Charan Dose Bhogi Sankranti Bengaluru