కార్ రేస్ కు నిధుల విడుదల.. ఐఏఎస్ అధికారి అర్వింద్ కు మెమో
- ఫార్ములా - ఈ తో ఒప్పందంపై పలు ప్రశ్నలు
- కేబినెట్ అనుమతి లేకుండానే రూ.50 కోట్లు విడుదల
- నిధుల విడుదలపై హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ పై ఆరోపణలు
తాజాగా ఆయనకు ప్రభుత్వం మెమో జారీ చేయడం సంచలనంగా మారింది. కాగా, ఫార్ములా రేస్ రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ముందస్తు నోటీసులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని ఫార్ములా - ఈ కంపెనీ ప్రశ్నించింది. మున్సిపల్ శాఖకు లీగల్ నోటీసులు పంపుతామని ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ప్రకటించింది. దీంతో ఫార్ములా - ఈ కంపెనీతో కుదిరిన ఒప్పందం, నిధులు విడుదల సహా పలు అక్రమాల వివరాలు బయటపడ్డాయి.