విశాఖలో కమ్మేసిన పొగమంచు.. దారి కనిపించక ఐదు వాహనాల ఢీ

పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో ఐదు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విశాఖపట్టణంలోని కొమ్మాది జంక్షన్‌లో ఈ ఉదయం జరిగిందీ ఘటన.

ప్రమాదానికి గురైన వాహనాల్లో ప్రైవేటు బస్సు, ట్యాంకర్, మూడు కార్లు ఉన్నాయి. ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.


More Telugu News