రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్య.. సభ హుందాతనం కాపాడాలని పోచారం సూచన
- అసెంబ్లీలో విద్యుత్పై స్వల్పకాలిక చర్చ
- సభలో ఖబడ్దార్ అన్న రాజగోపాల్ రెడ్డి
- రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరిన జగదీశ్ రెడ్డి
- వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలని సూచించిన పోచారం
కాగా అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ సందర్భంలో ఖబడ్దార్ అన్నారు. అయితే రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జగదీశ్ రెడ్డి కోరారు. ఈ సమయంలో సభాపతి ప్రసాద్ కుమార్ కల్పించుకొని... వ్యక్తిగత దూషణలకు దిగవద్దని, సభా మర్యాదలు కాపాడాలని కోరారు.
దీంతో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... ఇదే సభలో ఎర్రబెల్లి దయాకర రావు ఉరికించి కొడతానని వ్యాఖ్యలు చేశారని, అప్పుడు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంస్కారం ఎటు పోయింది? అని ప్రశ్నించారు. మా నుంచి అలాంటి వ్యాఖ్యలు రావడానికి మీరే కారణమన్నారు. తొందరపడకండి... పది రోజులే అయింది.. కాస్త ఓపిక పట్టండి అని వ్యాఖ్యానించారు.