Chandrababu: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా
![High Court adjourned Chandrababu bail petitions](https://imgb.ap7am.com/thumbnail/cr-20231206tn65704a46039d8.jpg)
- ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్
- ఉచిత ఇసుక కేసులోనూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
- రెండు పిటిషన్లపై విచారణ 12వ తేదీకి వాయిదా
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై విచారణను రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్పై విచారణను ఈ నెల 12వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అలాగే ఉచిత ఇసుక కేసులోనూ చంద్రబాబు పిటిషన్పై విచారణను డిసెంబర్ 12వ తేదీకే వాయిదా వేసింది. ఈ కేసులోనూ ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.