వైసీపీని ఎప్పుడు ఇంటికి పంపాలా అని ప్రజలు వేచి చూస్తున్నారు: నాదెండ్ల మనోహర్
- జనసేన పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలోనూ భారీ విజయం సాధించాలని ఆకాంక్ష
- తెనాలిలో క్రియాశీలక వాలంటీర్లతో సమావేశమైన జనసేన కీలక నేత
- ఎన్నికల సమయంలో ఎలక్షనీరింగ్పై అవగాహన కల్పించిన నాదెండ్ల మనోహర్
త్రికరణ శుద్ధితో 90 రోజులపాటు పని చేద్దామంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బలంగా ఎలక్షనీరింగ్ చేద్దామని, పోలింగ్ బూత్ వరకు స్ఫూర్తిని తీసుకొద్దామని వాలంటీర్లకు సూచించారు. క్రియాశీల వాలంటీర్ల సేవలు పార్టీకి కొండంత బలమని ప్రశంసించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో జల్లెడ పట్టాలని సూచించారు. వచ్చే ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా త్వరలోనే విడుదలవుతుందని, దానిని జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎలక్షనీరింగ్ చాలా ముఖ్యమని అవగాహన కల్పించారు. తెనాలిలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.