నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ కీలక సమావేశం
- సాయంత్రం టీటీడీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
- పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
- వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టే అంశంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న బాబు
ఈ నెల 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. రేపు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. వాస్తవానికి ఈ సమావేశం 3వ తేదీన నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే, 3న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో సమావేశాన్ని ఒక రోజు ముందుకు జరిపారు.