'దొంగ సాయిగా' అంటూ విజయసాయిరెడ్డిపై అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు
- ఎవరు నడవమన్నారో అంటూ లోకేశ్ పై విజయసాయి సెటైర్లు
- మీ అల్లుడు నత్తి పకోడీగాడిని ఎవరు నడవమన్నారంటూ అయ్యన్న కౌంటర్
- 3 నెలల తర్వాత ఏ దేశం పారిపోదామా అని ప్లాన్లు వేస్తున్నావట అంటూ ఎద్దేవా
మీ అల్లుడు నత్తి పకోడీగాడిని అప్పుడు ఎవరు నడవమన్నారు దొంగ సాయి? అని అయ్యన్న ప్రశ్నించారు. కనిపించినవాళ్లకల్లా ముద్దులు పెట్టి, మూతులు నాకి మీ అల్లుడు ఎందుకు చేశాడురా పాడెయాత్ర అని దుయ్యబట్టారు. నడవలేక కోర్టు వాయిదాల పేరుతో యాత్రని వాయిదా వేసుకోవడం మీ దొంగల్లుడికే చెల్లు అని అన్నారు. పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుని, అధికారం పోతే నీ బతుకేంటో తెలియక మెదడువాపు వ్యాధి వచ్చి పిచ్చి ట్వీట్లు వేస్తున్న దొంగసాయి... మూడు నెలల తరువాత ఏ దేశం పారిపోదామా అని ప్లాన్లు వేస్తున్నావట అని ఎద్దేవా చేశారు. సప్తసముద్రాల అవతల దాక్కున్నా లాక్కొచ్చి తిన్నదంతా కక్కించి, పేలిన ప్రతీ తప్పుడు కూతకీ వాత పెట్టించి... బొక్కలో వేస్తాంరా దొంగ సాయిగా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.