రాహుల్ గాంధీ ఫోన్ చేసి పిలిచారు: కాంగ్రెస్లో చేరడంపై మాజీ ఎంపీ వివేక్
- పోటీపై పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు నడుచుకుంటానన్న వివేక్
- కేసీఆర్ అవినీతి పాలన నుంచి విముక్తి కలిగించడమే తన లక్ష్యమని వ్యాఖ్య
- ఖర్గేను కలిసిన వివేక్, తనయుడు వంశీ
చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వివేక్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం సాగుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వివేక్ తనయుడు వంశీ పెద్దపల్లి నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. వామపక్షాలకు చెన్నూరు కేటాయిస్తామని తొలుత కాంగ్రెస్ తెలిపింది. ఇప్పుడు పొత్తుకు బ్రేక్ పడిన నేపథ్యంలో వివేక్కు చెన్నూరు టిక్కెట్ ఖరారైనట్లుగా భావించవచ్చునని తెలుస్తోంది.